CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామస్థుల సహకారంతో పోకలగూడెం గ్రామం లో సీసీ కెమెరాలు ఏర్పాటు...

Share it:

 



మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: నూతన టెక్నాలజీతో సమాజంలో నేర నియంత్రణ సాధ్యమని కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వరబాబు అన్నారు.బుధవారం పోకలగూడెం గ్రామపంచాయతీలో గ్రామస్తుల సహకారం తో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన సర్పంచ్ ఇస్లావత్ నిరోషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.... ఒక్కో సీసీ కెమెరా ముగ్గురు పోలీసులు చేసే పనితో సమానంగా విధులను నిర్వహిస్తాయన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేర నియంత్రణ వస్తుందని, తద్వారా నేరాలు తగ్గుతాయన్నారు.ప్రజల కోసం పని చేసే నాయకులు, అధికారులకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తుల సహకారంతో అందర్నీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్ళిన పంచాయతీ గుమస్తా నాగేశ్వరరావుని డిఎస్పి ప్రత్యేకంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సీఐ వసంత్ కుమార్, ఎస్ఐ విజయలక్ష్మి,సర్పంచ్ ఇస్లావత్ నిరోషా, మాజీ ఎంపీపీ గూగుల్ బాబు, ఉప సర్పంచ్ కాశీవిశ్వనాధ్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మాలోత్ భోజ్య నాయక్, రాములు, బాలాజీ, బాబూలాల్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: