CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జూలై 11 న చలో భద్రాచలం.

Share it:

 


దమ్మపేట జూలై 06 ( మన్యం మనుగడ ) : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలని జులై 11 సోమవారం నాడు పెద్ద ఎత్తున ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మళ్ళ వెంకటేశ్వరరావు కర పత్రాలు ఆవిష్కరిస్తూ. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆదివాసి గిరిజనులు పరిస్థితి ఇంకా దుర్బరంగానే ఉన్నది.పోడు భూములను లాక్కోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది గిరిజనుల దగ్గర నుండి పోడు భూములను ఒక్క ఎకరా తీసుకున్న వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన. సమాఖ్య భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చూస్తూ ఊరుకోదని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని పోడు భూములు ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసని పోడు భూములు జోలికి వచ్చిన ఏ ప్రభుత్వం నిలబడలేదని కాలగర్భంలో కలిసిందని టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని ప్రభుత్వాలను హెచ్చరించినారు

డిమాండ్స్

2005 అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

పేదలందరికీ ఆహార భద్రత కార్డులు ఇవ్వాలి

భూమిలేని ప్రతి గిరిజన కుటుంబానికి పేదలకు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని పంచాలి

తుని కాకు పెండింగ్ బోనస్ వెంటనే విడుదల చేయాలి

ఫారెస్ట్ వారు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

పోడు తాగుదారులపై ఫారెస్ట్ పోలీస్ దాడులు ఆపాలి

ఇల్లు లేని నిరుపేదలకు గిరిజనులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలి సొంత స్థలం ఉంటే ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలి

అర్హులైన వారికి వృద్ధాప్యం వితంతువు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలి వివిధ ప్రజా సమస్యలపై ఐటిడిఏ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరినారు ఈ కార్యక్రమంలో యార్లగడ్డ భాస్కరరావు పేరాల శ్రీనివాసరావు నరాటి రమేష్ వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: