CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెగిపడిన విద్యుత్ తీగలు కనబడితే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి:ఏ డి ఈ కోటేశ్వరరావు,ఏఈ రవి.

Share it:



గుండాల జూలై 10(మన్యం మనుగడ) గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.రెండు మండలాల్లో విద్యుత్ తీగలు తెగిపడితే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఏడిఈ కోటేశ్వరరావు,ఏ.ఈ రవికుమార్ ఒక ప్రకటనలో కోరారు. భారీ వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని విద్యుత్ స్తంభాలను, బట్టలు ఆరేయడం కోసం కట్టిన ఇనప తీగలను తాకరాదని వారు కోరారు. ముఖ్యంగా రైతులు ట్రాన్స్ ఫార్మర్ తాకవద్దని తడిసిన కర్రలతో విద్యుత్ ప్రయాణం కదిలించరాదని వారు కోరారు. ఏమైనా ప్రమాదం జరిగే సంఘటనలు ఉన్నట్లయితే తక్షణమే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.

Share it:

TS

Post A Comment: