CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భారీ వర్షాలు కురుసున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మంగపేట తహసీల్దార్

Share it:


మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండలం తహసీల్దార్ భారీ వర్షాలు కురుస్తున్న సందర్బంగా నీటి ముంపు ప్రాంతాలను సందర్శించినారు బుచ్చంపేట లో 2 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి, కమలాపురం లో ఒక ఇల్లు పూర్తిగా కూలిపోయినది మరియు నర్సాయిగూడెం లో ఒక ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.ఈ సందర్బంగా మంగపేట తహసీల్దార్ ప్రజలను ఉద్దేశించి తగు సూచనలు చేశారు.భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలందరు జాగ్రత్త గా అప్రమత్తం గా ఉండాలని, వరద నీటికి చెరువులు, కుంటలు తెగిపోయే ప్రమాదం ఉంటుంది కావున ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కోరారు.వర్షాకాలం లో విద్యుత్ విషయం లో చాలా జాగ్రత్త గా ఉండాలని ముఖ్యం గా రైతులు మీ వ్యవసాయం బోరుల వద్ద కరెంటు విషయం లో తడిసిన స్టార్టర్ బాక్స్ లను చేతులతో ముట్టుకోరాదని సూచించారు. చిన్న పిల్లలు ఈత రానివారు గోదావరి నది, వాగులల్లోకి ఈతకు కానీ చేపల వేటకు కానీ పోవద్దని తల్లి తండ్రులు పిల్లల విషయం లో అత్యంత జాగ్రత్త వహించాలని కోరారు.గోదావరి నది తీర ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ప్రజలను ఈసందర్బంగా తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: