మన్యం మనుగడ, పినపాక:
తాతలు తండ్రులు చదివిన పాఠశాల ఇప్పుడు మనకు దూరమవుతుంది. ఇంటికి చేరువలోనే విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల, దూరపు కొండలు నునుపు అనేలా మనము. మన ఊరి బడిలోనే విద్యాబుద్ధులు నేర్చుకున్న మన తాతలు, తండ్రులు మనకు మాత్రం సర్కారు బడిని దూరం చేస్తున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు, ప్రైవేటు పాఠశాలలకు పయణమవుతూ, ఇల్లు గుల్ల చేస్తున్నారు మన తల్లిదండ్రులు. వారు చదువుకొని సమాజంలో ప్రత్యేక గుర్తింపుని ఇచ్చిన పాఠశాల, మనకు మాత్రం దూరం చేస్తూ, ప్రైవేటు బడికి పంపుతున్నారు. ఉచితంగా, ఉన్నతంగా ఉండే విద్యను కాదని, ధనం ధారబోస్తూ, చదువును కొనుక్కుంటుంది నేటి విద్యార్థి లోకం. గత సంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వం, సర్కారు బడిలో ఒకటవ తరగతి నుండి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రైవేటు పాఠశాలకు పంపడానికి కారణం ఆంగ్ల మాధ్యమమే. ఇదే విద్యా విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తున్నది. భవిష్యత్తులో మీ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతారు. ప్రతి పేద విద్యార్థి కూడా ఆంగ్ల మాధ్యంలోనే చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్న సర్కారు పాఠశాలలను ప్రోత్సహిద్దాం. మన ఊరి బడి ముద్దు-ప్రైవేటు పాఠశాల వద్దు అనే నినాదంతో విద్యార్థులు ముందుకు సాగాలని ఆశిస్తూ....
మన్యం మనుగడ, పినపాక🖊️🖊️🖊️
Post A Comment: