జూలూరుపాడు జులై 23, (మన్యం మనుగడ) ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల తహశీల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ 2 గా విధులు నిర్వహిస్తున్న సోడే రామయ్య (52) అకస్మాత్తుగా గుండెపోటు తో శనివారం మృతి చెందారు. యధావిధిగా విధులకు హాజరైన రామయ్య అస్వస్థత గా ఉందని సహచరులకు చెప్పడంతో హుటా హుటిన కొత్తగూడెంలోని ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సోడే రామయ్య అంత్యక్రియలను స్వస్థలమైన చింతూరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. సోడే రామయ్య ఆకస్మిక మృతితో రెవిన్యూ శాఖ దిగ్భ్రాంతికి గురైంది.
Post A Comment: