CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చంద్రుగొండ లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు .

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ప్రధాన సెంటర్లో లో గురువారం ఎమ్మార్పీఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ 58వ జన్మదిన సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండా జెండాను జిల్లా నాయకులు చాపల మడుగు వెంకటేశ్వర్లు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిఆర్ఎస్ మండల అధ్యక్షులు దార వెంకటేశ్వర్లు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు వారధి సత్యనారాయణ, హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...

బీజేపీ ప్రభుత్వం ఎస్సీల ఏ, బీ, సీడీ వర్గీకరణ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టుకొని గద్దెనెక్కి ఎనిమిదేళ్ళు గడిచినప్పటికీ మాదిగల గురించి ఎనిమిది నిమిషాలు కూడా పార్లమెంట్లో మాట్లాడకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో మొన్న జరిగిన బిజెపి బహిరంగ సభలో ప్రధానమంత్రి మోడీ ఎస్సీల వర్గీకరణ విషయంలో కనీస మాట్లాడకుండా నిర్లక్ష్యం వహించిన దానికి నిరసనగా మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్ నాయకులు నల్లజెండాలతో నిరసన తెలిపితే బిజెపి సంబంధించిన గుండాలు, రౌడీలు ఎమ్మార్పీఎస్ నాయకులపై దాడులు చేయడంపై ఎమ్మార్పీఎస్ మహాజన సోషలిస్టు పార్టీ తరఫున,ఖండిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రెడ్డి పోగు సురేష్, కుక్క ముడి లక్ష్మయ్య, కుక్క ముడి నరసింహారావు, శేషగిరి, రెడ్డి పోగు రవి, చాపల మడుగు లక్ష్మణ్, నాగేష్, ఎం ఎస్ పి పార్టీ మండల అధ్యక్షులు కాశీ, ప్రధాన కార్యదర్శి శ్రీను, చాపల మడుగు నాగయ్య, నారా పోగు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: