మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని సున్నం బట్టి బైరగులపాడు వరద బాధిత గ్రామాలలో టీమ్ హోప్ సంస్థ పర్యటించింది. ఈ సందర్భంగా వారు వరద బాధిత కుటుంబాలను పరామర్శించి ఇలాంటి పకృతి వైపరీతలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి అందవలసిన సేవలు గురించి సదస్సు నిర్వహించారు అలానే గ్రామాల్లోని ప్రజలకు ఓటు హక్కు వినియోగం గురించి వివరించారు అనంతరం వరద బాధిత కుటుంబాలకు సబ్బులు పేస్టులు కొవ్వొత్తులు బియ్యం పాలు, చక్కెర దోమల అగరవత్తులు తదితర నిత్యవసర కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సభ్యులు సిద్ధాంతపు శ్రీనివాసరావు సిద్ధార్థ సంవిత చంద్రశేఖర్ రాకేష్ హరిత బిందు సతీష్ నేహ భార్గవి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: