CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తొలి ఆదివాసి మహిళ రాష్ట్రపతి కి శుభాకాంక్షలు తెలిపిన కొమరం భీమ్ ఆశయ సాధన కమిటీ..

Share it:

 


జూలూరుపాడు జులై 31, (మన్యం మనుగడ) ప్రతినిధి, తొలి ఆదివాసి గిరిజన మహిళ రాష్ట్రపతి గా ఎన్నికైన సందర్భంగా ద్రౌపది ముర్ము కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరం భీమ్ ఆశయ సాధన కమిటీ సభ్యులు మరియు జిల్లా ఆదివాసి సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివాసీలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ చరిత్రలో మొదటిసారిగా ఆదివాసి గిరిజన మహిళను ఎంపిక చేయడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉందని అన్నారు. ముర్ము ఎన్నికకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే రానున్న ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో కొమరం భీమ్ విగ్రహ ప్రతిష్ట కొరకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ టిడిపి ఆదివాసి నాయకులు అరెం రామయ్య, ఏన్కూరు ఎంపీపీ అరెం వరలక్ష్మి, జూలూరుపాడు రైతుబంధు సమితి అధ్యక్షులు యదళ్ళపల్లి వీరభద్రం, బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దొడ్డ అరుణ, మాజీ వైస్ ఎంపీపీ సీతా కుమారి సర్పంచ్ కుర్సం సత్యనారాయణ, ఆదివాసి నాయకులు తెల్లం నరసింహారావు దొర, పూసం సుధీర్, బచ్చల లక్ష్మయ్య, కల్తీ రాంప్రసాద్, వట్టం నాగేశ్వరరావు, వాసం శ్రీకాంత్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: