CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తాహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా:సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేత.

Share it:


జూలూరుపాడు జులై 2, (మన్యం మనుగడ) ప్రతినిధి, మండల వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు, మంజూరీ చేయాలని శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షలు పగడాల అఖిల్ కార్యదర్శి ఎస్.కె చాంద్ పాషా మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ఎంతోమంది నిరుపేదలు రేషన్ కార్డు లేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దరఖాస్తు చేసుకొని ఏళ్ళ తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని, అన్నారు. వెంటనే వారందరికీ రేషన్ కార్డులు మంజూరి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు నరేష్, వాసం శివ, కత్తి వెంకటేష్, పుల్లారావు, పత్తిపాటి మహేష్, కొండ హనుమంతరావు, నరేష్, కన్ని వంశీ, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: