జూలూరుపాడు జులై 02, (మన్యం మనుగడ) ప్రతినిధి, ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త సడక్ బంద్, మరియు హైదరాబాదులో బిజెపి జాతీయ సమావేశాలు అడ్డగింత కార్యక్రమంలో భాగంగా, శనివారం జూలూరుపాడు మండలకేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై పోటు గణేష్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఎమ్మార్పీఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దేపంగి రమణయ్య, చెంగల గురునాధం, గార్లపాటి రాంబాబు, తదితరులు ఉన్నారు.
Navigation
Post A Comment: