మన్యం మనుగడ,మంగపేట.
రమణక్కపేట గ్రామంలో కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గ్రామంలోని చెంచులక్ష్మి ఇల్లు కూలి పూర్తిగా నేలమట్టం అవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రమణక్కపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువత సంఘటన స్థలాన్ని సందర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి తక్షణ సహాయం కింద ఒక బియ్యంబస్తా కొన్ని కూరగాయలు నూనెలు పప్పులు అందివ్వడం జరిగింది. వారికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఇందారపు లక్ష్మణరావు,సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కుంకతి సాంబశివరావు, మండల నాయకులు గుమ్ముల మల్లికార్జున్ రావు,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓదెల సుధీర్ కుమార్,గ్రామ యూత్ నాయకులు గుమ్ముల రామయ్య,ముచ్చర్ల గణేష్ కుమార్,మునిగేల గణేష్ కుమార్ గుమ్ముల సాయి, మాచర్ల కంప్లీట్,మంచెర్ల దొవిన్,ఉప్పట్ల సాయి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: