మన్యం మనుగడ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి/చర్ల:
సారామహమ్మారి మరో పేద నిర్బాగ్యుడిని మంచాన పడేసింది. చర్ల మండలం పాత చర్ల కు చెందిన వల్లెపు శ్రీను(18)నాటు సారా కు బానిస ఐ మంచం బట్టి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మీకోసం మేమున్నాం సహాయక కమిటీ యువత ఆధ్వర్యంలో వెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది.అక్కడ అందుబాటులో లేని మందులను బయట కొనుగోలు చేసి వల్లెపు శ్రీను కు అండగా నిలిచారు. మరి కొంతమంది శ్రీను కుటుంబ సభ్యులు సైతం కుటుంబ బారిన పడి దానికి బానిసైనట్లు తెలియ వచ్చింది. ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సారించకుంటే మరింత మంది నిరుపేదలు ఈ మహమ్మారి బలి తీసుకోనుంది.
Post A Comment: