మన్యం టీవీ దుమ్ముగూడెం:
తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందజేస్తున్న స్వచ్ఛ విద్యాలయ అవార్డుకు మండలంలోని బండారుగూడెం ప్రాథమిక పాఠశాల ఎంపికైంది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ హాలులో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ చేతుల మీదుగా ఆ పాఠశాల హెచ్ఎం బెక్కంటి అవార్డును అందుకున్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలలు అవార్డులకు దరఖాస్తు చేసుకోగా, అందులో 7 అత్యుత్తమ పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయం పురస్కార్ అవార్డుకు ఎంపికైనాయి. వాటిలో దుమ్ముగూడెం మండలం బండారిగూడెం పాఠశాల తాగునీరు, మరుగుదొడ్లు, పచ్చదనం, పరిశుభ్రత, కొవిడ్ జాగ్రత్తలు, విద్యార్థుల ప్రవర్తన వంటి వాటిపై చేసిన సర్వేలో బండారిగూడెం పాఠశాల ఎంపికైంది. బండారిగూడెం పాఠశాల ఎంపికవటం పట్ల గ్రామస్థులు, ఉపాధ్యాయులు, విద్య కమిటీ చైర్మన్ తదితరులు బండారిగూడెం పాఠశాల హెచ్ఎం బెక్కంటి శ్రీనివాసరావు అభినందించారు..
Post A Comment: