జూలూరుపాడు జులై 10, (మన్యం మనుగడ) ప్రతినిధి, మండల పరిధిలోని పాపకొల్లు, పడమట నర్సాపురం, జూలూరుపాడు మసీదులలో ముస్లిం సోదరులు పవిత్ర బక్రీద్ పండుగను ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మసీదులో మౌల్వీ సాహేబ్, షేక్ ఆరీఫ్ బక్రీద్ ప్రాముఖ్యతను, విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం సామూహిక నమాజ్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ ప్రత్యేక నమాజ్ లో జామ మజీద్ కమిటీ అధ్యక్షులు షేక్ సిద్దిఖ్, కమిటీ సభ్యులు బాబాజి, బాబు, జానిమియ్యా, మీరా, షఫీ, లతీఫ్, పెద్ద నాగుల్ మీరా, సల్మాన్ ఖాన్, ఖాసీం, కరిముల్ల, యాసీన్, రఫీ, మస్తాన్, అక్బర్, బాజీ, తన్వర్, సమీర్, పీర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: