మన్యం మనగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం ఎల్చి రెడ్డిపల్లి మార్గం, వాగు ప్రవాహం కారణంగా ప్రతి సంవత్సరం కోతకు గురవుతూ వస్తుంది. ఇప్పటికే రహదారి సగం పైగా కోతకు గురై ప్రమాదకరంగా మారింది. విస్తార వర్షాల కారణంగా మరి కొంచెం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని, ప్రజలు వాపోతున్నారు. మళ్లించిన రహదారి మొత్తం బురదతో నిండి ఉండడం వలన,ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి,సత్వరమే పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.
Post A Comment: