మన్యం మనుగడ ఏటూరు నాగారం
గోదావరి పరివాహక ప్రాంతం అయిన ములుగు జిల్లాలో కన్నాయిగూడెం మండల పరిధిలో ఉన్న అనేక గ్రామాలు వరదలతో తీవ్రంగా నష్ట పోవడమే కాకుండా ఏకధాటిగా పడిన వర్షాల కారణంగా వివిధ గ్రామాల ప్రజలు వరద ముంపునకు గురియై తీవ్ర ఇబ్బందులకు గురి గురయ్యారని,ఇబ్బందులకు గురైన కుటుంబాలకు సుమారుగా 170 కుటుంబాలకు సేవ భారతి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో సేవా భారతి సంస్థ అందించిన సహకారాన్ని పలు గ్రామాల ప్రజలు,సేవా భారతి సంస్థ మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేసి మాలాంటి నిరుపేదలను ఆదుకోవాలని సేవ భారతి సంస్థను కొనియాడారు.ఈ కార్యక్రమంలో సేవ భారతి సభ్యులు కుందారపు మల్లికార్జున్,పటేల్ సంజీవ్,
ఆకుతోట మధుకర్,బొల్లం రజినికుమార్,కుందారపు తరుణ్,ఆకుతోట సతీష్,
గ్రామ పెద్దలు బొగ్గుల నాగేశ్వరరావు,పూజారి శ్రీనివాస్,తడకల మధుకర్,
బొగ్గులమధుకర్,మనోజ్,
రాము-లక్ష్మణ్,మనోజ్,సదానందం,సోమేష్,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: