మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలంలోని తిమ్మాపురం గ్రామ పోడు సాగు దారుల తో ఈనెల 27న ఎటునాగారం ఐటిడిఏ కార్యాలయం ముందు జరపతలపెట్టిన ధర్నా,ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గపూర్ పాషా పిలుపునిచ్చారు.సోమవారం మంగపేట మండలకేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ఫారెస్ట్ పోడు భూమి సాగు చేస్తున్న రైతులందరికీ మరియు హక్కు పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని అటవి హక్కుల చట్టం అమలు చేయాలని జులై 27న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సాగుదారులకు ఈసందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డి.వై.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు జాగటి చిన్నా, పోడు రైతులు రాంబాబు,రమేష్. అంజయ్య. లక్ష్మయ్య.విజయ్. శ్రీకాంత్ .కోషయ్య తదితర పోడు సాగు దారులు పాల్గొన్నారు.
Post A Comment: