మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డిపల్లి పంచాయతీ దేవనగరం గ్రామానికి చెందిన తోలెం శ్రీనివాస్ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. కరక గూడెం మండలం తాటి గూడెం గ్రామానికి చెందిన పూణెం వెంకట నరసయ్యకు 2000 సంవత్సరంలో రక్తపింజర కాటు వేయడంతో ఎడమ కాలు తొలగించడం జరిగింది. అప్పటినుండి ఒకే కాలుతో తిరుగుతున్న వెంకట నరసయ్య కు శ్రీనివాసు రూపంలో అదృష్టం వరించింది. వార్తాపత్రికల ద్వారా శ్రీనివాస్ గురించి తెలుసుకున్న వెంకట నరసయ్య ఆయన కుటుంబ సభ్యుల ద్వారా శ్రీనివాసును సంప్రదించడం జరిగింది. వివిధ ప్రమాదాలలో అవయవాలు కోల్పోయిన వ్యక్తులకు స్వచ్ఛంద సంస్థలను సంప్రదించి శ్రీనివాస్ సాయం అందిస్తున్నాడని, తన పరిస్థితిని వివరించాడు. వెంటనే విషయం తెలుసుకున్న శ్రీనివాస్ విజయవాడలోని కృత్రిమ కాలును అమర్చే ఎవల్యూషన్ సెంటర్ వారిని సంప్రదించి, ఉచితంగా కాలు పెట్టేందుకు వారిని ఒప్పించడం జరిగింది.ఈ విషయాన్ని వెంకట నరసయ్య కుటుంబానికి తెలిపిన శ్రీనివాస్ సోమవారం రోజున వెంకట నరసయ్యను విజయవాడలోని ఎవల్యూషన్ సెంటర్కు తీసుకెళ్లి దగ్గరుండి కృత్రిమ కాలును పెట్టించడం జరిగింది. తనకు కృత్రిమ కాలు అమలుచడంతో వెంకట నరసయ్య ఆనందంతో శ్రీనివాస్ కు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.సమస్య తెలిసిన వెంటనే స్పందించి పరోపకారం చేస్తున్న శ్రీనివాసును పలువురు కొనియాడుతున్నారు.
Post A Comment: