మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని తురుబక గ్రామంలో గోదావరి వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలకు భద్రాచలం రెడ్ క్రాస్ సొసైటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు యోగి సూర్యనారాయణ ఆధ్వర్యంలో తూరుబాక పరిధిలోని 160 కుటుంబాలకు నిత్యవసర సరుకుల ప్యాకెట్స్, వరదల కారణంగా పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు టార్బల్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొల్లి సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్ బొల్లి సూర్యచంద్రరావు, లైన్స్ క్లబ్ సభ్యులు బిల్లిపల్లి రంగారెడ్డి రాజిరెడ్డి, రవికుమార్ నర్సింగ్ కళాశాల బాలికలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: