మన్యం మనుగడ కరకగూడెం:
పేద కుటుంబానికి ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అద్యక్షులు రేగా కాంతారావు చేయూత నిచ్చారు.
కరకగూడెం మండల పరిధిలోని రఘునాధపాలెం గ్రామానికి చెందిన తెరాస వార్డు సభ్యులు పోలబోయిన నాగలక్ష్మి (40) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం తేలు కాటుకి గురై మరణించడంతో కుటుంబ సభ్యులను అయన పరామర్శించి అనంతరం
దశదినకర్మలకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 4000 వేల రూపాయల నగదును ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు, మండల అద్యక్షులు రావుల.సోమయ్య గౌడ్,ఉపాధ్యక్షులు పోగు. వెంకటేశ్వర్లు, నాయకులు రేగా.సత్యనారాయణ, కొంపెల్లి.పెద రామలింగం,బైరిశెట్టి.చిరంజీవి, రావుల.కనకయ్య,శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: