మన్యం టీవీ దుమ్ముగూడెం ::
ఎడతెరపు లేని వర్షాలు కురుస్తున్నందున మళ్లీ వరదలు వచ్చే సూచనలు ఉండడంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు దుమ్ముగూడెం టిఆర్ఎస్ పార్టీ బృందం మంగవై బడవా ఆశ్రమ పాఠశాల పునరావాస కేంద్రంలో ఉన్న సున్నం బట్టి, ఏం కాసినారం గ్రామాల ప్రజలకు తగు జాగ్రత్తలు మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉందని ఎవరు కూడా గ్రామాల్లోకి వెళ్ళొద్దని ఆదేశించారు. మండల అధ్యక్షులు అనే సత్యాలు మాట్లాడుతూ ఎవరు కూడా ముంపు ప్రదేశంలోకి వెళ్లకూడదని వరదలు తగ్గినంతవరకు ప్రభుత్వం కేటాయించిన కేంద్రంలో ఉండాలని సూచించారు పునరావస కేంద్రంలో భోజన వసతి వైద్య సేవలు మౌలిక సదుపాయాలు అన్ని సమకూర్చడం జరిగిందని ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పిటిసి తెల్లం సీతమ్మ, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కనితిరాముడు, నాయకులు శ్రీనివాసరావు, శేఖర్, జయసింహ, గంగరాజు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: