మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని రేగుబల్లి గ్రామంలో గోదావరి ముంపు బాధితులకు డిస్టిక్ ఎన్నారై పౌండేషన్, ఎలమంచి సీతారామయ్య ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గోదావరి వరద బాధితులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ పిలుపుమేరకు ఎన్నారై ఫౌండేషన్ సభ్యులు బాధితులను తమ వంతు సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యం బి నర్సారెడ్డి , మండల కార్యదర్శి కారం పుల్లయ్య , స్థానిక ఎంపిటిసి యలమంచి వంశీకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం స్వామి, యలమంచి సీతరామయ్య ట్రస్ట్ కన్వీనర్ సభ్యులు యలమంచి శ్రీను బాబు, మర్మం చంద్రయ్య, సభ్యులు కోర్స చిలకమ్మ, రాయపూడి ఏసురత్నం, స్థానిక వార్డ్ నెంబర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: