గుండాల/ఆళ్లపల్లి జులై 29(మన్యం మనుగడ) వారం రోజుల క్రితం వర్షాల దాటికి ఆళ్లపల్లి మర్కోడు మార్గమధ్యలో గల రాఘవాపురం గ్రామ సమీపంలోఅలుగు వరదాటికి రోడ్డు కోతకు గురైంది అధికారుల అలసత్వంతో నేటికీ మరమ్మతులు చేయకపోవడంతో రంగంలోకి దిగిన ఎంపీపీ మంచి భార్గవి దగ్గరుండి రహదారి మరమ్మతు పనులను చేయించారు. వారం రోజుల నుంచి ప్రజలు పడుతున్న సమస్యలను గమనించిన ఆమె మరమ్మత్తులు పూర్తి చేసే విధంగా చొరవ చూపారు. దగ్గరుండి పనులను చేయించి రాకపోకలకు సాగే విధంగా చేయించిన ఎంపీపీకి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు
Navigation
Post A Comment: