మన్యం మనుగడ, మంగపేట.
రూరల్ డెవలప్మెంట్ అండ్ ట్రస్ట్ రిలయన్స్ క్లబ్ సేవా సంస్థ ల ద్వారా జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మంగపేట మండల కేంద్రంలో వరద బాధతలకు నిత్యావసర సరుకులు,బియ్యం పప్పు, నూనె, కూరగాయలు మరియు దుప్పట్లు 70 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. గ్రామ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ మండల పార్టీ ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అయ్యోరి యానయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య, బి సి సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ, సీనియర్ నాయకులు చెట్టుపల్లీ వెంకటేశ్వర్లు, పోదేం నగేష్,బండపెల్లీ రవి,బూర్గుల సతీష్,బెత నరసింహారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: