CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీపీఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో డివి కృష్ణ సంతాప సభ.

Share it:

 


దమ్మపేట జులై 02 ( మన్యం మనుగడ ) : జనం కోసం పరితపించిన గుండె కొలిమి కామ్రేడ్ డి.వి.కృష్ణ భారత విప్లవోద్యమ నేత అని, నీతి, నిజాయితీ, నిబద్ధతకు కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడిన మహా నాయకుడు కామ్రేడ్ డి వి కే సంతాప సభను దమ్మపేట మండలం జమేదారు బంజర,గూర్వాయిగూడెం గ్రామాలలో జరపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘనంగా నివాళులర్పించారు.ఈ సంతాప సభలో పాల్వంచ డివిజన్ కార్యదర్శి అమర్లపుడి రాము మాట్లాడుతూ, సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివికె చనిపోవడం భారత విప్లవోద్యమానికి కార్మిక వర్గానికి తీరని లోటు అని జనం కోసం పరితపించే గుండె కొలిమి కామ్రేడ్ డీవీకే అని ఆయన అనారు డివి కృష్ఞ విప్లవోద్యమ చరిత్రను ప్రజలకు గుర్తు చేశారు.జులై 5 వ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం లో జరుగు సంతాప సభను,జులై 15 వా తారీకున హైదరాబాద్ లో సుందరయ్య భవన్ లో జరుగు సంతాప సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలలో మండల నాయకులు కుంజా కాంతారావు,తామా రాముడు,కీసరిరాముడు,వూకే గంగమ్మ,శ్రీను,గంగరాజు, సున్నం జగన్ పూజల సంజీవరావు,లక్ష్మి,నాగేశ్ పోతురాజు పూనెం రాము తదితరులు పాల్గోనారు.

Share it:

TS

Post A Comment: