మన్యం టీవీ మణుగూరు: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం హైద్రాబాద్ లో నిర్వహించిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మణుగూరుకు చెందిన మాజీ సింగరేణి కార్మికుడు గొర్రె దుర్గేశ్వర్రావు నాలుగు పతకాలు సాధించి.. మణుగూరు కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు. హైద్రాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో గురువారం జరిగిన ఈ పోటీల్లో 26 రాష్ట్రాల జట్లు పాల్గొన్నాయి. కాగా తెలంగాణా జట్టులోని దుర్గేశ్వర్రావు మాస్టర్ క్యాటగిరి 74 కేజీల విభాగంలో సిల్వర్ పతకం, డెడ్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే బాంక్ స్కాడ్ లో సిల్వర్, బెంచ్ ప్రెష్ లో సిల్వర్ పతకాలు సాధించి సత్తా చాటారు. జాతీయ స్థాయి పోటీల్లో నాలుగు పతకాలు సాధించిన దుర్గేశ్వర్రావుకు మణుగూరు ప్రముఖులు, మిత్రులు, సింగరేణుయులు అభినందనలు తెలిపారు.
Post A Comment: