మన్యం మనుగ కరకగూడెం: మండలంలోని అశ్వాపురంపాడు గోతి కోయ గ్రామం అశ్వపూరంపాడ్ లో ప్రభుత్వ వైద్యాధికారి పర్షియా నాయక్ వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని 57 మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 28 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్ గా గుర్తించారు. ఈ సందర్భంగా డాక్టర్ పర్షియా నాయక్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కాశి వడపోసిన నీరును మాత్రమే తాగాలని ఆయన అన్నారు. వానకాలంలో వచ్చే అంటూ వ్యాధులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. గ్రామంలో పరిసరాలను పరిశీలించి గ్రామస్తులకు తగు సూచనలు అందించారు. నీటి నిలవలు ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని టైర్లు కానీ కూలర్లో కానీ నీరు లేకుండా చూడాలని ఆయన అన్నారు. దోమలు అభివృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ దోమతెరలు వాడాలని సూచించారు. ఫ్రైడే డ్రై డే లో భాగంగా యాంటీ లారువాల్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీను, ఎంపీఓ చిరంజీవి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: