మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, దబ్బతోగు గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి మోక్షం ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు దబ్బతోగు గ్రామ ప్రజలు. వివరాలలోకి వెళ్తే దెబ్బతోగు గ్రామం నడి మద్యన ఉన్న అంగన్ వాడి భవనం కూలి పోవడంతో పాత ప్రాధమిక పాఠశాలని అంగన్వాడీ కేంద్రానికి కేటాయించారు. ఆ పాఠశాల కట్టి దాదాపు 40సంవత్సరాలు పైబడింది దాని కాల పరిమితి కూడా అయిపోయింది. ఆ పాఠశాల లో కూడ పై కప్పు చిన్న చిన్న పెచ్చులు ఊడి పడుతున్నాయి. పిల్లలు భయాందోళనకు గురువుతున్నారు. ఎప్పుడు కూలిపోతుందో అని భయపడుతున్నారు. సంబంధిత అధికారుల ద్రుష్టికి గ్రామస్థులు తీసుకెళ్లినా స్పందించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రస్తుతం భారీగా కురిసే వర్షాలకి పాఠశాల బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో అని భయపడుతున్నామని వారు అన్నారు. అంగన్వాడి కేంద్రానికి పంపిచకపోతే పిల్లల భవిష్యత్తు పాడవుతుందని, వారు ఆవేదన వ్యక్తం చేసారు. ఆ పాత పాఠశాలకు తలుపులు కిటికీలు కూడా లేవని, దీనిని బట్టి పాఠశాల పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చునని వారన్నారు. చిన్న పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నూతన అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించాలని కోరుతున్నారు. అధికారులు స్పందించకపోతే తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు తెలియజేసారు.
Navigation
Post A Comment: