CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బ్రిడ్జి నిర్మాణంలో కనీసం నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలంలో కడుతున్న మంగపేట నుండి బోరనర్సాపురం వరకు వెళ్ళడానికి బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు ఈ నిర్మాణం లో కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదు, అంత పెద్ద కట్టడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఈ బ్రిడ్జి పిల్లర్స్ బేస్మెంట్ లేకుండా నిర్మాణం చేయడం విశేషం. వరద ఉదృతంగా ఉన్నప్పుడు బేస్ మెంట్ వరద ఉదృతిని తట్టుకుని పిల్లర్స్ సురక్షంగా కాపాడుతుంది, కానీ మంగపేట నుండి బోరు నర్సాపూర్ బ్రిడ్జి నిర్మాణం లో ఎటువంటి బేస్ మెంట్ లేకుండా నిర్మాణం చేయడం ప్రమాదాలకుదారి తీస్తుంది అందువలన ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ఈ నిర్మాణం యొక్క స్థితి గతులను, నాణ్యత ప్రమాణాలు పరిశీలన లోకి తీసుకొని తద్వారా ప్రజలను, ప్రజల ఆస్తులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.ఇప్పుడు కట్టే కొత్త బ్రిడ్జి స్థానంలో ఉన్న బ్రిడ్జి ఇప్పటికి నిర్మాణం ధృడంగా ఉండటం విశేషం, బ్రిడ్జి నిర్మాణం లో ప్రతి పిల్లర్ కు బేస్మెంట్ తో పాటు నిర్మాణం లో నాణ్యతా ప్రమాణాలతో పోలిస్తే ఇప్పుడు కట్టే బ్రిడ్జ్ కంటే ఎన్నో రెట్లు మేలు అని ఎమ్మార్పిఎస్, ఎమ్మెస్పి నాయకుడు గుగ్గిళ్ల సురేష్ ఈ సందర్బంగా తెలియ జేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మార్పిఎస్ మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్, సిపిఎం జిల్లా నాయకులు ఎల్పీ ముత్యాలు, బి ఎస్పీ జిల్లా నాయకులు వీరాస్వామి,ఎమ్మార్పిఎ స్ సీనియర్ నాయకులు ఎంపెల్లి మల్లేష్, బి ఎస్పీ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి మందపెళ్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: