CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది అసత్య ప్రచారాలు.... - సర్పంచ్ పద్దం వినోద్

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ :

మద్దుకూరు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అసత్య ప్రచారాలు నిర్వహిస్తున్నారని వారు చేస్తున్న తాటాకు చప్పుళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడే ప్రసక్తే లేదని మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్ అన్నారు. శుక్రవారం మద్దుకూరులో ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపతి ముర్ము కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్దుకూరు గ్రామపంచాయతీ సర్పంచ్ గా నేను ఎన్నికైనప్పటి నుంచి అభివృద్ధి పనుల్లో ఎక్కడ రాజీపడకుండా గ్రామపంచాయతీని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాని, రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో అభివృద్ధి పనులు చేయించుకొని నిధులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని అయినా కూడా అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నామని, వీటన్నిటిని చూసిన అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులకు ముచ్చెమటలు పడుతున్నాయని, రాబోయే రోజుల్లో ప్రజలు వీరిని విశ్వసించరనే భయంతో పంచాయతీ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్న ప్రభుత్వ అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు అసత్య ప్రచారాలు నిర్వహిస్తున్నారని, ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడే ప్రసక్తే లేదన్నారు. గ్రామపంచాయతీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని ప్రజలే రాబోయే రోజుల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చుండ్రు విజయ్, వేణు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: