మన్యం టీవీ మణుగూరు:
వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం వీఆర్ఏల దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు మాట్లాడుతూ,సమస్య పరిష్కారం అయ్యేవరకు వెన్నంటే ఉంటామని వారికి హామీ ఇవ్వడం జరిగింది.మాజీ శాసనసభ్యులు నర్రా రాఘవరెడ్డి ఏర్పాటు చేసిన వీఆర్ఏ సంఘం అని,కర్రల కొట్టుడు పోరాటం నుండి ప్రారంభమైన ఈ సంఘం అనేక సమస్యలను పరిష్కరించేందుకు పోరాటం చేస్తుందన్నారు.పే స్కేల్ అమలు అయ్యేవరకు,అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్ సాధించే వరకు,55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకు వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వాలని వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.రెండో రోజు దీక్షలకు ఎమ్మార్పీఎస్ సిపిఐ ఎంఎల్ ప్రజాపందా వీఆర్వోల సంఘం తదితర ప్రజా సంఘాలు మద్దతు తెలిపారని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియునాయకులు కొడిశాల రాములు,టీవీ ఎం వి ప్రసాద్, నందం, ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: