మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు కు చెందిన చిర్రా. శ్రీనివాస్ గౌడ్,జాతీయ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికయ్యారు. భద్రాచలం లో ఆదివారం జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ద్వితీయ జిల్లా మహాసభ లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జాతీయ సభ్యులు పులిపాలుపుల ఆనందం,రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మామిడి సోమయ్య,బసవ పున్నయ్య, ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ మహాసభలో సుమారు 300 మంది సభ్యులు పాల్గొన్నారు. జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా మహాసభలో ఎన్నుకున్నందుకు శ్రీనివాస్ గౌడ్ సంతోష్ వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాబోయే కాలంలో జర్నలిస్టుల సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.మహాసభలో నాపై ఉంచిన బాధ్యతను జర్నలిస్టుల సమస్యలపై పోరాడేందుకు కృషి చేస్తారనని వారు తెలిపారు.
Post A Comment: