మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: పాల పై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను విధించడం అన్యాయమని టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు విమర్శించారు.గురువారం పాలపై జిఎస్టి పన్ను విధించడాన్ని నిరసిస్తూ టిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఖాళీ పాల డబ్బాలతో ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బీజేపీ పాలనలో సామాన్యులు దేశంలో బ్రతికే సూచనలు కనబడడం లేదని విమర్శించారు. అన్ని వస్తువుల పై జిఎస్టి పేరుతో అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్నారని, దీనిపై ప్రధానమంత్రి నోరు విప్పాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళన కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు చీదెళ్ళ పవన్ కుమార్, చాపలమడుగు రామరాజు, మళ్లెం వెంకటేశ్వర్లు, గుగులోతు శ్రీనివాస్ నాయక్, సుంకర రామారావు, భూపతి సత్యనారాయణ, గూగులోతు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: