మన్యం టీవీ చర్ల:
చర్ల మండలం పాత చర్ల చెరువు నిండడంతో చెరువు ఎగువన గండి పడి బయటికి వచ్చిన వరద నీరు చుట్టూ ఉన్న పొలాలలో నిండి ట్రాక్టర్ తిరగడానికి తీసిన దారి ద్వారా బయటికి వస్తున్నాయి. ఈ స్థలాన్ని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర రావు, చర్ల తహసిల్దార్ భరణి బాబు, డి ఇ తిరుపతి ,యం. డి. ఓ శంకర్ నాయక్ సందర్శించి దీని వలన ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదని, ఆ నీరంత పక్కన ఉన్న వాగులో కలుస్తుందని, కంగారు పడాల్సిన అవసరం లేదని సూచించారు.తెరాస పార్టీ చర్ల మండల ప్రధాన కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాస యాదవ్, ఉపాధ్యక్షులు పోలిన లంకరాజు, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాస రెడ్డి, చర్ల టౌన్ అధ్యక్షులు ముమ్మనేని సత్య సంపన్, ఉద్యమ నాయకులు మెహబూబ్ పఠాన్ సందర్శించారు.
Post A Comment: