మన్యం మనుగడ, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఐదు సంవత్సరముల బుడ్డోడు గుద్దేటి సాహిత్ వాళ్ళ తాత అయినా గడ్డం పుల్లారావు ఇంటి ప్రాంగణంలో హరితహారంలో భాగంగా గులాబీ మొక్కను నాటి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వాళ్ళ తాత గడ్డం పుల్లారావు మాట్లాడుతూ మొక్కల పెంపకం తోనే మానవుడే మానుగడ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడవుల విస్తీర్ణత పెంచిందని ప్రతి గ్రామంలో హరితహారం లో భాగంగా రోడ్లకు ఇరువైపులా ప్రతి ఇంటికి ఒక మొక్క నాటేలా చేసి ఆకుపచ్చ తెలంగాణగా మార్చిన ఘనత మంత్రి కేటీఆర్ కే దక్కుతుందని తెలిపారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మనవడు గుద్దేటి సాహిత్ మొక్కను నాటడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
Post A Comment: