CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని ప్రతి ఆదివాసి గూడెం లో ఘనంగా జరుపుదాం, స్వయం ప్రతిపత్తిని సాధిద్దాం -నారం సీతారాం సింగ్.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని 1994 లో ఐక్య రాజ్య సమితి ప్రకటించిన నుండి ప్రతి సంవత్సరం ఆగష్టు 9న ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం జరుపుకుంటున్న విషయం మనందరికి తెలిసిందే. ఈ దినోత్సవం రోజున ప్రపంచ వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లో ఆదివాసీ హక్కుల గురించి అవగాహన కలిగిస్తారు. ఆదివాసులకు అండగా నిలబడిన వారిని స్మరించు కొంటారు. అందులో భాగంగా ఆగస్ట్ 9 నా అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం సందర్భంగా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆదివాసి నాయకపోడు బిడ్డ ఆదివాసి దినోత్సవాన్ని వారి యొక్క గ్రామాలలో మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవాలని ఆదివాసి నాయకపోడు సేవా సంఘం అశ్వరావుపేట మండల అధ్యక్షుడు నారం సీతారాం సింగ్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామంలో ఆదివాసీ నాయకపోడు సేవ సంఘం మండల స్థాయి సమావేశం మండల అధ్యక్షుడు నారం సీతారాం సింగ్ అధ్యక్షతను జరిగింది. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు నారం సీతారాం సింగ్ మాట్లాడుతూ త్వరలో రాబోయే ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ సందర్భంగా ఆదివాసి నాయకపోడు గూడేలలో ప్రతి యొక్క గిరిజన నాయకపోడు బిడ్డలు వారి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరికి తెలిసే విదంగా నియోజక వర్గ వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు, బైక్ ర్యాలీలు నిర్వహించి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని ఆదివాసీ నాయకపోడు సేవ సంఘం వ్యవస్థాపకులు మద్ది రామచంద్రయ్యనీ స్మరించుకోవాలనీ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడు సేవాసంఘం మండల ప్రధాన కార్యదర్శి దాది చంటి, ఉపాధ్యక్షులు గెడ్డం చిట్టి బాబు, కోశాధికారి గెడ్డం సత్తిబాబు, సభ్యులు దాది సోమరాజు, పూజరి పోతురాజు, బి మోహన్ రావు, ఎన్ జగదీశ్వరావు, తాళ్ల వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: