CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చదువులమ్మకు ప్రోత్సాహం.

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు పంచాయితీలో ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు కుర్వాపల్లి కొత్తూరు గ్రామానికి చెందిన బాణాల వాసంతి లక్ష్మి ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ నందు రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు, గురుకుల జూనియర్ కళాశాల ఎంట్రెన్స్ నందు రాష్ట్రస్థాయి 6వ ర్యాంకు సాధించి అశ్వాపురం మండలానికి రాష్ట్రస్థాయి లో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన సందర్భంగా కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని గిఫ్ట్ఎస్మైల్ కార్యక్రమంలో భాగంగా మండల టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జాలె రామకృష్ణా రెడ్డి బాణాల వాసంతి లక్ష్మి ఇంటికి వెళ్ళి అభినందించి 5000 నగదు, ప్రోత్సాహం అందించారు. మరింత ఉన్నత చదువులు చదివి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమెను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, ప్రధాన కార్యదర్శి మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ మేడవరపు సుధీర్,ఎంపీటీసీ తాటి పూజిత, నాయకులు కొల్లు మల్లారెడ్డి, బండ్ల కాంతారావు, తాటి వెంకటేశ్వర్లు, కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: