మన్యం మనుగడ కరకగూడెం:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు చూసి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.బుధవారం కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా ప్రజలందరూ అభినందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ప్రజాసంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులను కాంగ్రెసు,బీజేపీ చూసి ఓర్వలేక టీఆర్ఎస్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు.బీజేపి, కాంగ్రెసు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయాలని ఆయన సూచించారు.గతంలో
కేంద్రంలో ఉన్న కాంగ్రెసు,బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదని,కేసీఆర్ పై అనవసర ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు.
అదే విధంగా పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు రేగా కాంతారావు పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని కాంగ్రెసు,బిజెపి యాత్రలు,ఎన్ని డ్రామాలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.రానున్న ఎన్నికల్లో పినపాకలో ఎగిరేది గులాబీ జెండానే ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు జాడి రామనాథం,మండల నాయకులు కొంపెల్లి పెద్ద రామలింగం,రేగా సత్యనారాయణ,సర్పంచులు పాయం నర్సింహారావు,పోలెబోయిన నర్సింహారావు,బత్తిని నర్సింహారావు,సొసైటీ డైరెక్టర్ రావుల కనకయ్య,మండల యూత్ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు పాయం రాజబాబు,జవ్వాజి సమ్మయ్య,ఉప సర్పంచు బోడ ప్రశాంత్,నిట్టా ప్రభాకర్,గోగు వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: