CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జడ్పీటిసి పొశం.నర్సింహారావు.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో శుక్రవారం నాడు కురిసిన భారీ వర్షం కారణంగా సింగరేణి పీకే ఓ సి-4 రోడ్ల నుండి భారీ వరద రావడంతో సురక్ష బస్టాండ్, శేషగిరి నగర్ భగత్ సింగ్ నగర్ భారీ వరద రావటం వలన ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఆదేశాల మేరకు తక్షణమే స్పందించిన మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు శనివారం నాడు ఈ ప్రాంతాన్ని మండల ప్రజాప్రతినిధులు,అధికారుల తో కలిసి పరిశీలించారు. వెంటనే సింగరేణి అధికారులతో మాట్లాడి వారితో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. సింగరేణి ఓసి ఫోర్ నుండి వరద రాకుండా తక్షణమే తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడటం జరిగింది.ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపీపీ కారం విజయ కుమారి, సింగరేణి జనరల్ మేనేజర్ జక్కం రమేష్,డీజిఎం సివిల్ వెంకటేశ్వర్లు,ఓ సి ఫోర్ ప్రాజెక్ట్ అధికారి లక్ష్మీపతి గౌడ్,ఈ ఈ నర్సిరెడ్డి,ప్రాథమిక పరపతి సంఘం అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు,అడపా అప్పారావు,పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: