మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని గోదావరి వరద ముంపులు ప్రాంతాల్లో సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు పర్యటించారు
మండలంలో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తక్షణం ముంపు బాధితులకు ₹10,000 రూపాయలు అకౌంట్లో జమ చేయాలని మండలంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.మండలంలో ముంపు గ్రామాల పర్యటన లో భాగంగా గంగోలు గ్రామంలో డబల్ బెడ్ రూం నిర్వాసితులకు దుప్పట్లు, చీరలు పంపిణి చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఆనాడు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అప్పుడే ఈ స్థలం అనువైన ప్రదేశం కాదని గోదావరి వరద ప్రభావం ముందు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఏంటని సిపిఐ పార్టీ డిమాండ్ చేసిందని కానీ అధికారులకు విన్నవించిన పెడచెవిని పెట్టారని అందుకు నిదర్శనం నేడు కనపడుతుందని తక్షణం శాశ్వత పరిష్కారం కింద ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్, సీపీఐ మండల సహాయ కార్యదర్శి నోములు రామిరెడ్డి, రమేష్,జిల్లా సమితి సభ్యులు అకోజు సునీల్ కుమార్, రమేష్, ఖాదర్, కొలిపాక శివ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: