CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు మండలం లో విస్తృతంగా పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు.బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, 'నేను ఉన్నాను అని' భరోసా కల్పించిన,ప్రభుత్వ విప్,రేగా కాంతారావు

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా కూనవరం గ్రామపంచాయతీ ఎన్టీఆర్ నగర్ 2 గ్రామానికి చెందిన కంగాల సత్యం (47) సంవత్సరాలు ఇటీవ.ల కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం సమితి సింగారం గ్రామపంచాయతీకి చెందిన మిడిదొడ్డి లక్ష్మి (60) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి దశదినకర్మలకు హాజరై మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించారు.


కూనవరం గ్రామపంచాయతీ బొంబాయి కాలనీ లో ఎక్సలెంట్ స్కూల్ డైరెక్టర్ జానీ మియా ఖాన్ గారి తండ్రి అఫ్జల్ ఖాన్ (70) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించడంతో వారి నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం

మణుగూరు మండలం లోని సబ్ స్టేషన్ ఏరియా చెందిన నాదెళ్ల శ్రీనివాస రావు ఇటీవల కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాస్తు ఇంటిదగ్గర కింద పడి స్వల్ప గాయాలవడంతో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,ఎంపీటీసీ ల సంఘం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు,సర్పంచ్ ప్రసాద్,స్థానిక,ప్రజాప్రతినిధులు,పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా,అప్పారావు, పార్టీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: