CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పునరావాస కేంద్రాలకు తరలిన గోదావరి తీర ప్రజలు.

Share it:

 


మన్యం మనుగడ పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని గోదావరి తీర ప్రాంతాలైన భూపతి రావు పేట ,vచింతల బయ్యారం గ్రామ ప్రజలను దగ్గరలోని పునరావాస కేంద్రాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు తరలిస్తున్నారు. గురువారం ఉదయం నాటికి గోదావరి నీటిమట్టం 66 అడుగులకు చేరే అవకాశం ఉన్నందున,ముంపు ప్రాంతాలైన భూపతి రావుపేట, చింతల బయ్యారం గ్రామాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. చాలా సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద భారీగా గోదావరి వరదలు రావడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాలలో పినపాక మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: