మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం లోని ఇంటెక్ వెల్ వద్ద గోదావరి ఉధృతిని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, ఐటీడీఏ పిఓ తో కలసి పరిశీలించారు. అనంతరం ఎస్టీ కాలనీ ఏకే మల్లారం రోడ్డు బ్లాక్ వద్ద నీటి ప్రవహన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేసారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో అప్రమత్తం గా ఉండాలన్నారు.
అదే విధంగా రోడ్డుపై ఒక అంగుళం కన్న ఎక్కువ ఎత్తుగా నీరు ప్రవహించినట్లయితే ముందు జాగ్రత్త చర్యగా ఆ రోడ్డును తాత్కాలికంగా బ్లాక్ చేయాలని అయన తెలిపారు. భారీగా వర్షం పడుతున్న సందర్బంగా ముందు జాగ్రత్తగా చర్యగా తాత్కాలికంగా ఆ ప్రాంతాలో విద్యుత్ ను నిలిపివేసి నష్టాన్ని నివారించాలని అన్నారు.
ప్రజలు వర్షాలు తగ్గే వరకు ప్రయాణాలు పెట్టుకోవద్దని, రోడ్ల మీదకు రావద్దని కోరారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఓడి సీఎం ఎస్ సాంబశివరావు, మండల స్పెషల్ ఆఫీసర్ ఎస్సి కార్పొరేషన్ ఈడీ తుల రవి, డిఎల్ పిఓ దేవరాజ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: