గుండాల జూలై 7(మన్యం అమనుగడ) ప్రపంచంలో ఎక్కడ లేని గొప్ప పథకం దళిత బంధు అని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం ఆళ్లపల్లి మండలంలో పర్యటించిన దళిత బంధు పథకం ద్వారా ఎంపిక చేయబడ్డ లబ్ధిదారులకు వాహనాలను ఆయన అందించారు. ఏడు ట్రాక్టర్లు, ఒక బొలెరో, ట్రైకర్ పథకం ద్వారా వచ్చిన వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితుడికి దళిత బంధు పథకం అమలవుతుందని అన్నారు. రానున్న రోజుల్లో దళిత బంధు లబ్ధిదారులను ఎన్నిక చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉన్న దళితులందరూ టిఆర్ఎస్ పార్టీ నే కాదని మిగతా పార్టీలలో కూడా దళితులు ఉన్నారని వారికి సైతం దళిత బంధువులు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన అన్నారు. దళిత బంధు పథకం ద్వారా మీ ఖాతాలో జమ ఆయన డబ్బులు ఎవరు తీసుకోరని లబ్ధిదారుడికే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, ప్రజా ప్రతినిధులు అధికారులు దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Post A Comment: