గుండాల జూలై 7(మన్యం మనుగడ) బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం మండలంలో పర్యటించిన ఆయన కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు వచ్చిన చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలవుతాలేవని ఆయన అన్నారు. కల్యాణ లక్ష్మి పథకం పేద ఇంటి ఆడపడుచులకు ఒక వరమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి పథకం ద్వారా వచ్చిన 41 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం, తాసిల్దార్ నాగ దివ్య, ఎంపీడీవో హజరత్ వలి, ఎంపీటీసీ సంధాని, శంభుని గూడెం సర్పంచ్ సుధాకర్, ప్రజా ప్రతినిధులు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: