మన్యం మనుగడ, అశ్వారావుపేట:గోదావరి వరద ముంపు బాధితుల సహాయార్ధం సిపిఐ(యం) మండల కమిటీ ఆద్వర్యంలో శనివారం మండల కన్వీనర్ చిరంజీవి నేతృత్వంలో విరాళాలు సేకరణ చేపట్టారు. మండల పరిధిలోని నందిపాడులో స్థానిక సర్పంచ్ ఊకే వీరాస్వామి పర్యవేక్షణలో ఇంటింటికీ తిరిగి 10 క్వింటాళ్ళు బియ్యాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గడ్డం సత్యనారాయణ, మడకం నాగేశ్వరరావు, సత్యవతి, ఎంపిటిసి మాజీ సభ్యులు మాడి నాగేశ్వరరావు, పెద్ద ప్రసాద్, జోగారావు, సీతయ్య, బుచ్చి రాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: