మన్యం మనుగడ కరకగూడెం:పేదల ఆరోగ్యానికి తెరాస ప్రభుత్వం పెద్దపీటం వేసిందని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక అన్నారు.
శనివారం కరకగూడెం మండల పార్టీ కార్యాలయంలో మండలానికి చెందిన 10 మంది బాధితులకు 3,85,500 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కులను పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య తో కలిసి ఆమె అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అనారోగ్యాలపాలయై దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో తోడ్పుపడుతుందని ఆమె తెలిపారు.ప్రతి పేదవాడికి కార్పొరేట్ చికిత్సలు ఉచితంగా అందించేందుకు హెల్త్కార్డులను అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,మండల యూత్,ఎస్టీ,మహిళా అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,పాయం రాజబాబు,మహిళ మండల అద్యక్షురాలు కాసు. లావణ్య,మండల నాయకులు రేగా సత్యనారాయణ,అక్బర్ ఖాన్,ఎల్లా గౌడ్,సర్పంచులు కుంజ వసంతరావు,కొమరం విశ్వనాథం,సొసైటీ డైరెక్టర్ రావుల కనకయ్య,నాగరాజు,నాగేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: