ములకలపల్లి:(జులై03):
మన్యం మనుగడ ప్రతినిధి :
మండలం పరిధిలోని చలమన్ననగర్ లోని 346 కంపార్ట్మెంట్ లోని 25 హెక్టార్ల లో అటవీ శాఖ ఆదివారం ప్రారంభించింది.ఈ సందర్భంగా అటవీ శాఖ సెక్షన్ అధికారి నీలమయ్య కొబ్బరికాయ కొట్టి ప్లాంటేషన్ పనులు మొదలు పెట్టారు.మొత్తం 25 హెక్టార్ల కు గాను 30 వేల మొక్కలు నాటుతున్నట్లు అటవీ బీట్ అధికారి భాస్కర్ తెలిపారు. వేరు మద్ది, జిట్రేగు, వేప, మర్రి, రావి, నెమలి నారా వంటి మొక్కలను ఈ నర్సరీ కి ఎంపిక చేసినట్లుతెలిపారు.2005 పోడు సాగుచేస్తున్న వారి భూములను గుర్తించి వారికి ఒక అవగాహన కల్పించి ఉన్నతాధికారులు ఈ ప్లాంటేషన్ మొదలు పెట్టినట్లు తెలిపారు.
Post A Comment: