మన్యం మనుగడ, అశ్వారావుపేట: గిరిజనుల న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ అన్నివేళలా సంపూర్ణ మద్దతు ఇస్తుందని పార్టీ నియోజక వర్గం సీనియర్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవరావు తెలిపారు. ఆయన నేతృత్వంలో ఆదివారం మండల పరిధిలోని రామన్నగూడెం భూ పోరాటంలో అరెస్ట్ అయిన సర్పంచ్ మడకం స్వరూపతోపాటు మిగతా గిరిజనులను కలిసి పరామర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ గిరిజనులు పక్షమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బూసి పాండురంగ,నియోజకవర్గ నాయకులు దంజు నాయక్, ఆర్యవైశ్య టౌన్ అధ్యక్షులు జల్లిపల్లి దేవరాజు,యువ విభాగం నాయకులు వేముల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: